న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: ఎంత ఆస్తి ఉన్నప్పటికీ కొంత మంది అతి సాధారణ జీవితం గడుపుతుంటారు. ఈ కోవలేకే వస్తాడు ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి. కోట్ల కొద్దీ సంపద ఉన్నా.. ఈ వృద్ధ వ్యక్తి గ్రామీణ ప్రాంతంలో ఓ సామాన్య వ్యక్తిగా జీవితం కొనసాగిస్తున్నాడు. పలలు కంపెనీల్లో ఆయనకు దాదాపు రూ.100 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయట. ఈ విషయాన్ని ఆయననే స్వయంగా వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వీడియో తీస్తున్న వ్యక్తితో మాట్లాడుతూ తన పెట్టుబడుల వివరాలను అతను వెల్లడించారు. అదనంగా ప్రతి ఏడాది డివిడెండ్ల రూపంలో రూ.6 లక్షలు వస్తాయని తెలిపారు. ఈ వీడియోను రాజీవ్ మెహతా అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశాడు.