Adhiraj Panigrahi : లోక్సభ ఎన్నికల వేళ వివిధ పార్టీల నేతల రాజీనామాలు, చేరికలు ఊపందుకున్నాయి. తాజాగా ఒడిశాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదిరాజ్ పాణిగ్రాహి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఒడిశా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు శరత్ పట్టానాయక్కు పంపించారు.
‘తాను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీలోని వివిధ హోదాలకు రాజీనామా చేస్తున్నా. గడిచిన 25 ఏండ్లుగా తనకు దేశానికి సేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతున్నా. దయచేసి నా రాజీనామాను ఆమోదించగలరు’ అని ఆదిరాజ్ పాణిగ్రాహి తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.