భువనేశ్వర్: ఒడిశాలో సుమారు రెండు లక్షల ఇండ్ల కేటాయింపు కోసం ప్రధాని నరేంద్ర మోదీని సీఎం నవీన్ పట్నాయక్ డిమాండ్ చేశారు. పీఎంఏవై (జీ) ప్రత్యేక ప్యాకేజీ కింద ఫణి బాధిత కుటుంబాలకు 1.84 లక్షల ఇండ్లు నిర్మించాలని కోరారు. ప్రధానంగా షెడ్యూల్డ్ గిరిజన జిల్లాలు, కేబీకే జిల్లాల్లో నివసిస్తున్న పేదలకు 13 లక్షల ఇళ్లు ఇవ్వాలని నవీన్ పట్నాయక్ అడిగారు. ఈ మేరకు ప్రధాని మోదీకి శనివారం ఆయన లేఖ రాశారు.
ఒడిశాలోని బీజూ జనతా దళ్ (బీజేడీ) ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి. ఉపాధ్యాయురాలి హత్య ఘటనపై ఆరోపణలున్న మంత్రిని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇటీవల బీజేపీ యువ మోర్చా, కాంగ్రెస్ కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. దీనికి ముందు సీఎం కాన్వాయ్పై బీజేపీ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో గతంలో ఫణి బాధిత కుటుంబాలకు సహాయం అందిస్తామన్న కేంద్రం హామీని సీఎం నవీన్ పట్నాయక్ గుర్తు చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఘాటుగా లేఖ రాశారు.