న్యూఢిల్లీ: మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ప్రతినిధి నుపుర్ శర్మను ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమెకు గన్ లైసెన్సు జారీ చేశారు. ఏకధాటిగా బెదిరింపు కాల్స్ వస్తున్న నేపథ్యంలో నుపుర్కు తుపాకీ లైసెన్సు ఇచ్చినట్లు తెలుస్తోంది. బెదిరింపుల నేపథ్యంలో గన్ లైసెన్స్ కావాలని ఆమె దరఖాస్తు చేసుకున్నారు. 2022, మే 26వ తేదీన ఓ టీవీ ఛానల్ చర్చలో పాల్గొన్న ఆమె.. ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల వల్ల దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
నుపుర్ శర్మపై దేశవ్యాప్తంగా మొత్తం 10 కేసులు నమోదు అయ్యాయి. అయితే ఆ కేసులను సుప్రీంకోర్టు ఒకే దగ్గరకు ట్రాన్స్ఫర్ చేసింది. నుపుర్ శర్మ వ్యాఖ్యలను ఖండిస్తూ అమరావతి, ఉదయ్పూర్లో ఘోర ఘటనలు జరిగాయి. అమరావతిలో ఉమేశ్ను, ఉదయ్పూర్లో కన్హయ్యలాల్ను ఉన్మాదులు తల నరికివేశారు. నుపుర్ శర్మ తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు తెలిపారు.