China | ఇప్పటికే భారత భూభాగం విషయంలో కిరికిరి చేస్తున్న చైనా.. తాజాగా వియత్నాంపై పడింది. వియత్నాం భూభాగాన్ని ఆక్రమించడానికి చైనా ప్రయత్నాలు ప్రారంభించిందని ఓ మీడియా సంస్థ పేర్కొంది. గాల్వాన్ సరిహద్దుల్లో ఎలాగైతే చైనా రాళ్లు రువ్విందో, అచ్చు అలాగే వియత్నాం నాగరికులపై కూడా రాళ్లు రువ్విందని ఆ మీడియా సంస్థ పేర్కొంది. ఈ ఘటన ఉత్తర వియత్నాంలోని గియాంగ్ ప్రాంతంలో జరిగింది. జనవరి 3న వియత్నాం కార్మికులపై చైనా సైనికులు రాళ్లు రువ్వారని, అలాగే బండ బూతులు కూడా తిట్టినట్లు ఆ మీడియా తెలిపింది. నదీ జలాల ప్రవాహం విపరీతంగా ఉందని, కొందరు వియత్నాం కార్మికులు కోతను నివారించడానికి అక్కడ కాపలాగా ఉన్నారు. ఈ సమయంలోనే చైనా సైన్యం వియత్నాం కార్మికులపైకి రాళ్లు రువ్వింది.