లండన్, నవంబర్ 15: అల్జీమర్స్ కట్టడికి బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్ శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ థెరపీని తీసుకొచ్చారు. మెదడులో మెమొరీ భాగాన్ని నష్టపరిచే హానికరమైన ప్రొటీన్లు పేరుకుపోకుండా ఈ వ్యాక్సిన్ సాయపడుతుందని తెలిపారు. ఈ టీకా ఒక్కో డోసు ధర రూ.450గా పేర్కొన్నారు. ఇప్పటికే జంతువులపై చేసిన క్లినికల్ ట్రయల్స్ విజయవంతమయ్యాయని, వచ్చే రెండేండ్లలో మనుషులపై ప్రయోగాలు జరిపి వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా నాలుగున్నర కోట్ల మంది అల్జీమర్స్తో బాధపడుతున్నారు.