న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: ధూమపానంతో ఊపిరితిత్తులకు ప్రమాదమని ఇప్పటివరకు తెలుసు. అయితే, పొగతాగే వారి ఒళ్లంతా గుల్ల అవుతున్నట్టు న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ప్రొఫెసర్ ఉమాకుమార్ తెలిపారు. ధూమపానంతో ఎముకలు, దంతాలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతున్నట్టు పేర్కొన్నారు.
పొగతాగేవారితో పాటు పీల్చేవారికి కూడా ఈ ప్రమాదం పొంచి ఉన్నదని హెచ్చరించారు. మహిళల్లో కూడా ధూమపాన సేవనం పెరుగుతున్నదన్న ఆయన.. సంతానలేమి, ముందస్తు జననాలకు ఇది దారితీయొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.