Northern Army Chief | సరిహద్దు ఆవల నుంచి భారత్లోకి వచ్చిన వారిలో పలువురు రిటైర్డ్ పాక్ సైనికులు ఉన్నారని నార్తర్న్ కమాండింగ్ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేద పేర్కొన్నారు. రాజౌరి, పూంచ్ను ఆనుకొని ప్రాంతాల్లో దాదాపు 20 నుంచి 25 మంది ఉగ్రవాదులు ఇంకా చురుగ్గా ఉండొచ్చన్నారు. రాజౌరి ఎన్కౌంటర్ అమరవీరులకు జమ్మూలో ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదుగురు వీర జవాన్లను ఎన్కౌంటర్లో కోల్పోయామన్నారు. అయితే, ఇద్దరు కిరాతక ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు పేర్కొన్నారు.
వారిని హతమార్చడంతో ఉగ్రవాదులతో పాటు పాక్కు పెద్దదెబ్బేనన్నారు. ధంగ్రీ, కంది, రాజౌరీ ప్రాంతాల్లో ఉగ్రవాదులు అమాయక పౌరులను ఉగ్రవాదులు చంపారన్నారు. ఉగ్రవాదులు పాక్, ఆఫ్ఘనిస్థాన్ సహా పలు దేశాల్లో శిక్షణ పొంది నార్తర్న్ కమాండ్ చీఫ్ తెలిపారు. ఉగ్రవాదులు మంచి శిక్షణ పొందారని.. వారిని నిర్మూలించేందుకు సైన్యానికి కొంత సమయం పట్టిందని పేర్కొన్నారు. మన సైనికులు ధైర్యంగా పోరాడారన్నారు.
లాన్స్ నాయక్ సంజయ్ బిష్త్ ఏడురోజుల్లో ఉగ్రవాదులను మట్టుబెడుతామని హామీ ఇచ్చారని.. అయితే, బెంగళూరులోని తండ్రి ఎంవీ ప్రాంజల్ ఉగ్రవాదుల మృతి వార్త వినేందుకు నిరీక్షిస్తున్న సమయంలోనే.. కొడుకు బలిదానం వార్తను అందుకున్నారన్నారు. రాజౌరి, పూంచ్ హైవేల ద్వారా దేశంలోని ఇతర ప్రాంతాలకు అనుసంధానించబడి ఉన్నందున.. అక్కడ మరింత మంది ఉగ్రవాదులు ఉండే అవకాశం ఉందన్నారు. ఉగ్రవాదుల్లో కొందరు రిటైర్డ్ పాకిస్థాన్ సైనికులుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. గత ఏడాది ఈ ప్రాంతాల్లో జరిగిన ఉగ్రవాద ఘటనల్లో 10 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని నార్తర్న్ కమాండ్ చీఫ్ వివరించారు.