చండీగఢ్: పంజాబ్లో ఎవరూ సురక్షితంగా లేరని ఆ రాష్ట్ర మాజీ సీఎం అమరీందర్ సింగ్ అన్నారు. సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసే వాలా తుపాకీ కాల్పుల్లో మరణించడంపై ఆయన స్పందించారు. దారుణమైన ఆయన హత్య షాకింగ్కు గురి చేసిందని ట్వీట్ చేశారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. పంజాబ్లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా కప్పకూలిందంటూ ఆప్ ప్రభుత్వంపై మండిపడ్డారు. నేరస్తులకు చట్టంపై భయం లేకుండా పోయిందని విమర్శించారు. ‘ఆప్ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. పంజాబ్లో ఎవరూ సురక్షితంగా లేరు’ అని ఆరోపించారు.
తమ పార్టీ నేత, సింగర్ సిద్ధూ మూసే వాలా తుపాకీ కాల్పుల్లో మరణించడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. తమ పార్టీతో పాటు దేశానికి తీవ్ర షాకింగ్ న్యూస్ అని పేర్కొంది. కాగా, సిద్ధూ హత్యకు ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆ పార్టీ నేత రాఘవ్ చద్ధా నేరుగా బాధ్యులని పంజాబ్ బీజేపీ విమర్శించింది. సెక్యూరిటీ తొలగించిన వ్యక్తుల పేర్లు బయటకు ఎలా లీక్ అయ్యాయని ఆ పార్టీ నేత మంజీందర్ సింగ్ సిర్సా ప్రశ్నించారు. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరుపాలని డిమాండ్ చేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేయించిన హత్య అని అకాలీ దళ్ నేత దల్జీత్ సింగ్ చీమా ఆరోపించారు.
మరోవైపు, సిద్ధూ మూసే వాలా హత్య వార్త తెలిసి దిగ్భ్రాంతి చెందడంతోపాటు చాలా బాధపడినట్లు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ ట్వీట్ చేశారు. బాధ్యులైన వారినెవరినీ వదిలిపెట్టబోమని అన్నారు. ఆయన కుటుంబానికి సంతాపం ప్రకటించారు. ప్రతి ఒక్కరు శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు.
Brutal murder of Sidhu Moosewala is shocking. My profound condolences to the bereaved family.
Law and order has completely collapsed in Punjab. Criminals have no fear of law. @AAPPunjab government has miserably failed. Nobody is safe in Punjab!
— Capt.Amarinder Singh (@capt_amarinder) May 29, 2022
A high level enquiry should be ordered against the reckless @PunjabGovtIndia officers or leaders involved in sharing this document with the public.@BhagwantMann @CMOPb @ANI @thetribunechd @punjabkesari @ZeePunjabHH https://t.co/aDeljpY8Hr
— Manjinder Singh Sirsa (@mssirsa) May 28, 2022
सिद्धू मूसेवाला का क़त्ल बेहद दुःखद और स्तब्ध करने वाला है। मैंने अभी पंजाब के CM मान साहिब से बात की। दोषियों को सख़्त से सख़्त सजा दिलवायी जाएगी। मेरी सबसे बिनती है कि सब लोग हौसला रखें और शांति बनाए रखें। भगवान उनकी आत्मा को शांति दे। https://t.co/cYc2k7e30Y
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 29, 2022