ముంబై: కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముంబై పోలీసులు కొత్త ఆదేశాలు జారీ చేశారు. జనవరి 15వ తేదీ వరకు 144వ సెక్షన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా కొత్త ఆంక్షలు ప్రకటించారు. బీచ్లు, ఓపెన్ గ్రౌండ్లు, సముద్ర తీరాలు, గార్డెన్లు, పార్క్లు, పబ్లిక్ స్థలాల వద్ద సాయంత్రం 5 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు నిషేధం విధించారు. జనవరి 15వ తేదీ వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని ముంబై పోలీసులు తెలిపారు. డీసీపీ ఆపరేసన్స్ చైతన్య ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. వెడ్డింగ్ల కోసం అత్యధికంగా 50 మందికి మాత్రమే అనుమతి కల్పించారు. సామాజిక, సంస్కృతిక కార్యక్రమాలకు కూడా 50 మందే లిమిట్ పెట్టారు. అంత్యక్రియలకు 20 మంది కోసం పరిమితి విధించారు.