బెంగళూరు, సెప్టెంబర్ 22: ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్లను నిద్రాణ స్థితి నుంచి మేల్కొలిపేందుకు ఇస్రో శుక్రవారం ప్రయత్నించింది. అయితే వాటి నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. శుక్రవారం కూడా ఈ ప్రయత్నాలు కొనసాగుతాయని తెలిపారు. వాస్తవానికి విక్రమ్, ప్రజ్ఞాన్ను 14 రోజులపాటు (చంద్రుడిపై ఒక పగలు) పనిచేసేలా రూపొందించారు.
చంద్రుడిపై సూర్యాస్తమయం కావడంతో ఈ నెల మొదటివారంలో వాటిని నిద్రాణ స్థితిలోకి పంపారు. తాజాగా అక్కడ సూర్యడయం కావడంతో వాటిని తిరిగి మేల్కొలిపేందుకు ఇస్రో ప్రయత్నాలు చేస్తున్నది. ఒకవేళ ఇది విజయవంతం అయితే బోనస్ లభించినట్టే.