పుణె: మంగళసూత్రం ధరించని, బొట్టు పెట్టుకోని మహిళ పట్ల ఏ భర్త అయినా ఎందుకు ఆసక్తి చూపుతాడని పుణె జిల్లా జడ్జి ఓ మహిళను ప్రశ్నించారు. భర్త తనపై గృహ హింసకు పాల్పడినట్టు ఆ మహిళ చేసిన ఆరోపణలపై నడుస్తున్న కేసులో ఆ న్యాయమూర్తి మధ్యవర్తిగా వ్యవహరించారు. న్యాయవాది జహగిరిధర్ ఆ మహిళకు, జడ్జికి మధ్య జరిగిన సంభాషణను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు.
ఆ దంపతులిద్దరూ కొద్ది రోజుల క్రితమే విడిపోయారు. అయితే వారి సమస్యను సామరస్యంగా పరిష్కరించి ఇద్దరినీ కలిపేందుకు జడ్జి ప్రయత్నించారు. ‘నీవు మంగళ సూత్రం ధరించలేదు. సింధూరం కూడా పెట్టుకోలేదు. పెండ్లయిన దానిలా ప్రవర్తించకుండా, వీటిని ధరించకుండా ఉంటే నీ భర్త నీ పట్ల ఎందుకు ఆసక్తి చూపాలి? అని జడ్జి ఆమెను ప్రశ్నించారు.