న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17 : సుప్రీంకోర్టు ప్రతిపాదించిన బీమా లేకపోతే ఇంధనం లేదు విధానాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్న క్రమంలో వాహన రిజిస్ట్రేషన్ నంబర్లను ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(ఐఐబీ), ‘వాహన్’ రికార్డులతో సరిపోల్చే ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్(ఏఎన్పీఆర్) వ్యవస్థను ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఏఐ) సిద్ధమవుతున్నది.
ప్రతిపాదిత విధానం అమల్లోకి వస్తే చెల్లుబాటు అయ్యే థర్డ్-పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ లేని వాహనాలకు పెట్రోల్ లేదా డీజిల్ అమ్మడాన్ని ఇంధన కేంద్రాలు(పెట్రోల్ పంపులు) నిరాకరించే అవకాశం ఉంటుంది. ఈ ప్రయోగాత్మక కార్యక్రమం విజయవంతమైతే సాధారణ బీమా సంస్థలకు ఇది బీమా లేని భారీ సంఖ్యలో వాహనాలను అధికారిక బీమా పరిధిలోకి తీసుకువచ్చే అవకాశం కల్పిస్తుంది.