డెహ్రాడూన్: కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కొత్త ఆంక్షలు పెట్టింది. సంక్రాంతి రోజున హరిద్వార్లో పుణ్య స్నానాలపై కఠిన ఆంక్షలను విధించింది. మకర సంక్రమణ వేళ గంగా నదిలో నిర్వహించే పవిత్ర స్నానాలపై సంపూర్ణ నిషేధం విధించింది. హరిద్వార్లో నైట్ కర్ఫ్యూ కూడా విధించారు. జనవరి 14వ తేదీన భక్తులెవ్వరూ గంగా నది స్నానాల కోసం రావొద్దు అని హరిద్వార్ జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. హరి కీ పౌరి వద్ద నిషేధం అమలులో ఉంటుంది. 14వ తేదీన రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 6 వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేయనున్నారు.