డెహ్రాడూన్: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అమరీందర్ సింగ్కు పార్టీలో అవమానం జరిగిందనడం ఒట్టి అబద్ధమని ఆ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి హరీష్ రావత్ ( Harish Rawat ) చెప్పారు. తనను కాంగ్రెస్ పార్టీ అవమానించిందంటూ ఇటీవల అమరీందర్సింగ్ చేసిన స్టేట్మెంట్ను పరిశీలిస్తే అతను ఒకరకమైన ఒత్తిడిలో ఉన్నట్లు అర్థమవుతున్నది.
అమరీందర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఒకసారి పునరాలోచన చేసుకోవాలని, తన వ్యాఖ్యల ద్వారా బీజేపీకి ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఉపయోగపడటం మంచిదికాదని హరీష్ రావత్ సూచించారు. గత కొన్నాళ్లుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏంచేసినా అది కెప్టెన్ అమరీందర్సింగ్ గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడటానికి.. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తేవడానికే చేసిందని ఆయన చెప్పారు.