న్యూఢిల్లీ: కో-విన్ పోర్టల్ నుంచి ఎలాంటి డేటా లీక్ కాలేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కో-విన్ పోర్టల్లో స్టోర్ చేసిన డేటా, ఆన్లైన్లో లీక్ అయినట్లుగా పలు మీడియా కథనాలు వచ్చాయి. అయితే కేంద్ర ప్రభుత్వం వీటిని ఖండించింది. కో-విన్ పోర్టల్ నుంచి ఎలాంటి డేటా లీక్ కాలేదని తెలిపింది. ఈ డిజిటల్ ప్లాట్ఫారమ్లో నమోదైన వ్యక్తుల మొత్తం డేటా సురక్షితంగా ఉందని స్పష్టం చేసింది.
అలాగే కో-విన్ పోర్టల్ డేటా లీక్ గురించి మీడియాలో వచ్చిన వార్తల నిజానిజాలపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విచారణ జరుపుతున్నదని కేంద్రం తెలిపింది. వ్యక్తుల చిరునామా లేదా ఆర్టీ-పీసీఆర్ ఫలితాలను కో-విన్ పోర్టల్లో సేకరించడంలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో సంబంధిత డేటా లీక్పై వస్తున్న మీడియా కథనాల వాదన ప్రాథమికంగా సరైనది కాదన్నది స్పష్టమవుతున్నదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ఒక అధికార ప్రకటనను శుక్రవారం విడుదల చేసింది.