బెంగళూరు/ఘజియాబాద్, జూన్ 24: ట్విట్టర్ ఇండియా ఎండీ మనీశ్ మహేశ్వరికి కర్ణాటక హైకోర్టులో ఉపశమనం లభించింది. ఘజియాబాద్లో వృద్ధుడైన ముస్లింపై దాడికి సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా మనీశ్కు అక్కడి పోలీసులు సమన్లు జారీ చేశారు. అయితే మనీశ్పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు ఆదేశించింది. అవసరమైతే వర్చువల్ పద్ధతిలో ఆయనను పోలీసులు విచారించవచ్చని పేర్కొంది.