న్యూఢిల్లీ: జేడీయూ నూతన జాతీయ అధ్యక్షుడిగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎన్నికయ్యారు. శుక్రవారం ఇక్కడ జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గంలో ప్రస్తుత అధ్యక్షుడు లలన్ సింగ్ స్థానంలో నితీశ్ను ఎన్నుకున్నట్టు పార్టీ అధికార ప్రతినిధి కేసీ త్యాగి చెప్పారు.