Nitish Kumar : బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్కు భారత రత్నను ప్రకటించిన నేపధ్యంలో ఇది తన ఘనతగా ప్రధాని నరేంద్ర మోదీ చాటుకుంటారని బిహార్ సీఎం నితీష్ కుమార్ అన్నారు. కర్పూరీ ఠాకూర్ జయంతోత్సవం సందర్భంగా జేడీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో నితీస్ కుమార్ మాట్లాడుతూ జయ నాయక్ కర్పూరీ ఠాకూర్ పేదల సంక్షేమానికి చేసిన కృషిని కొనియాడారు.
కర్పూరీ ఠాకూర్కు భారత రత్న ఇవ్వాలని తాము 2007 నుంచి ఇప్పటివరకూ పలు ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ వచ్చామని ఆయన గుర్తుచేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాం నుంచి ఇప్పటివరకూ ఏ ఒక్క ప్రభుత్వం తమ విజ్ఞప్తిని పట్టించుకోలేదని ఎట్టకేలకు కర్పూరీ ఠాకూర్కు భారత రత్న ప్రకటించినందుకు ప్రధాని, కేంద్ర ప్రభుత్వాన్ని తాను అభినందిస్తున్నానని అన్నారు.
దివంగత నేత కుమారుడు, ప్రస్తుతం జేడీయూలో ఉన్న రామ్నాథ్ ఠాకూర్కు ప్రధాని మోదీ కాల్ చేశారని, అయితే ప్రధాని తనకు మాత్రం ఇప్పటివరకూ ఫోన్ చేయలేదని, ఈ ఘనతను ప్రధాని మోదీ కొట్టేసేందుకే ఇలా చేశారని నితీష్ కుమార్ అన్నారు. ఏమైనా బిహార్లో తాను అధికారం చేపట్టినప్పటి నుంచి తాము లేవనెత్తిన డిమాండ్ను మన్నించినందుకు ప్రధానితో పాటు ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని నితీష్ పేర్కొన్నారు. ప్రజా జీవితంలో నైతిక విలువల కోసం కట్టుబడిన కర్పూరీ ఠాకూర్ ఎన్నడూ తన కుటుంబ సభ్యులను రాజకీయ పదవుల్లో ప్రోత్సహించలేదని ఈ విషయంలో తనకు ఆయనే స్ఫూర్తి అని నితీష్ అన్నారు.
Read More :
Glenn Maxwell: ఫుల్గా తాగి స్పృహ కోల్పోయిన మ్యాక్స్వెల్