పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఎన్డీయే కూటమితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారి ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్కు ఎదురుపడ్డారు. (Nitish Kumar-Lalu Interaction) రాజ్యసభ స్థానానికి ఆర్జేడీ అభ్యర్థుల నామినేషన్ కోసం భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజస్వీ యాదవ్తో కలిసి లాలూ ప్రసాద్ యాదవ్ గురువారం అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి నుంచి వెళ్తున్న సీఎం నితీశ్ కుమార్ ఆయనకు తారసపడ్డారు. దీంతో నితీశ్ నవ్వుతూ లాలూ వద్దకు వెళ్లి ఆయన భుజాన్ని తట్టి పలకరించారు. పక్కన ఉన్న తేజస్వీ యాదవ్ను కూడా పలకరించారు. లాలూ భార్య రబ్రీదేవికి కూడా నితీశ్ మర్యాద పూర్వకంగా నమస్కరించారు. అనంతరం కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే లాలూ, నితీశ్ ఎదురుపడిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, లాలూ ప్రసాద్ యాదవ్ తన ఇద్దరు కుమారులు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, భార్య రబ్రీ దేవితో కలిసి అనంతరం నామినేషన్ గదిలోకి వెళ్లారు. దీనికి ముందు బీహార్ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన స్పీకర్ నంద్ కిషోర్ యాదవ్కు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి అభినందనలు తెలిపారు.
NDA में शामिल होने के बाद जब पहली बार लालू यादव से मिले मुख्यमंत्री नीतीश कुमार pic.twitter.com/ijpLqohOeJ
— Dhiraj Singh (@dhirajvoice) February 15, 2024