సిలిగురి: కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఇవాళ పాల్గొన్నారు. అక్కడ గడ్కరీ అస్వస్థతకు లోనైట్లు తెలుస్తోంది. సిలిగురిలో స్టేజ్పై ఆయన సొమ్మసిల్లారు. డాక్టర్లు ఆయన్ను పరీక్షించారు. షుగర్ లెవల్స్ తగ్గినట్లు పరీక్షల ద్వారా డాక్టర్లు పేర్కొన్నారు.
సిలిగురిలో ఇవాళ మూడు జాతీయ హైవే ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. సుమారు 1206 కోట్లతో ఆ ప్రాజెక్టులను చేపడుతున్నారు. గడ్కరీ ఆరోగ్యం గురించి మరింత సమాచారం రావాల్సి ఉంది.