న్యూఢిల్లీ, మే 16: కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీకి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. కేంద్రమంత్రి నివాసానికి సోమవారం సాయంత్రం ఈ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. కేంద్రమంత్రి కార్యాలయ అధికారుల నుంచి తమకు ఫిర్యాదు అందిందని, వారు ఇచ్చిన వివరాల ఆధారంగా విచారణ జరుపుతున్నామని ఢిల్లీ పోలీసులు మంగళవారం వెల్లడించారు. ఇంతకుముందు కూడా పలుమార్లు గడ్కరీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి.