సాంగ్లీ, జూన్ 20: మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది చనిపోయారు. మహిసాల్ పట్టణంలో ఇంట్లోనే ఒక దగ్గర ముగ్గురి మృతదేహాలు, మరో చోట ఆరుగురి మృతదేహాలు కనిపించాయి. వారంతా విషం తాగి ఆత్మహత్య చేసుకొన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. మృతుల శరీరాలపై ఎలాంటి గాయాలు లేవన్నారు. మరణానికి గల అసలైన కారణం పోస్టుమార్టం తర్వాతే తెలుస్తుందని సాంగ్లీ ఎస్పీ దీక్షిత్ చెప్పారు. ఈ ఘటన ఢిల్లీలో 2018లో ఒకే కుటుంబంలో 11 మంది ఆత్మహత్య చేసుకొన్న బురారీ ఘటనను గుర్తుకు తెచ్చింది. బురారీలో ఆ కుటుంబం మూఢ నమ్మకాలతో పునర్జన్మ కోసం ఆత్మహత్య చేసుకొన్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.