ఊటీ: ఆర్మీకి చెందిన ఎంఐ-17 వీ5 హెలికాప్టర్ తమిళనాడులో కూలిన విషయం తెలిసిందే. ఈ హెలికాప్టర్ నీలగిరి జిల్లాలో కూలింది. ఇది కర్నాటక బోర్డర్ వద్ద ఉంది. నీలగిరి కొండల్లోనే ఈ ప్రాంతం ఉంది. టూరిస్టు నగరం ఊటీ ఇక్కడే ఉంది. ఈ ప్రాంతాన్నే ఉదకమండలం అని అంటారు. ఊటీ , వెల్లింగ్టన్ ప్రాంతాల్లో..చాలా మంది రిటైర్ డిఫెన్స్ ఉద్యోగులు నివసిస్తుంటారు. సీనిక్ ప్రదేశాల్లో వారి ఇండ్లు ఉంటాయి. ఒకరకంగా ఇక్కడ మిలిటరీ సేఫ్ కల్చర్ ఉంటుంది. హై ఆల్టిట్యూడ్ ప్రాంతమే అయినా.. ప్రమాదంలో అనుమానాలు అవసరం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కొండల మధ్య పొగమంచు కామన్. బ్రీఫింగ్, బ్లాక్బాక్సులు సమాచారం ఆధారంగా.. ప్రమాద ఘటనపై పూర్తి సమాచారం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. సిబ్బందికి మెడికల్ పరీక్షలు జరిపిన తర్వాత వారికి ఎగిరే అవకాశం ఇస్తారు. ప్రతికూల వాతావరణంలో ఇక్కడ హెలికాప్టర్లు ఎగురుతాయి. కానీ ఈ దుర్ఘటన ఎలా జరిగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రమాదానికి గురైన హెలికాప్టర్లో సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్ దంపతులు ఉన్నారు. ఇప్పటి వరకు 11 మంది మరణించినట్లు తెలుస్తోంది. గాయపడ్డ ముగ్గురికి తీవ్ర స్థాయిలో గాయాలయ్యాయి. వారికి మంటల వల్ల శరీరం అంతా కాలిపోయినట్లు చెబుతున్నారు.