లండన్ : నైట్ షిఫ్ట్ ల్లో పనిచేసే వారికి కొవిడ్-19తో ఆస్పత్రి పాలయ్యే అవకాశం మూడు రెట్లు అధికమని తాజా అథ్యయనం వెల్లడించింది. రాత్రి వేళ పనిచేసేవారికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని మాంచెస్టర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 6000 మందిని ప్రశ్నించిన మీదట పరిశోధకులు ఈ వివరాలు వెల్లడించారు.
అస్తవ్యస్త పనిగంటలతో సుఖ నిద్ర కరవవడంతోనే వీరు వైరస్ ల బారిన పడతారని పేర్కొన్నారు. 24 గంటలు పనిచేసే ప్రదేశాల్లో పరిశుభ్రత, డిస్ ఇన్ఫెక్షన్ చేసే వెసులుబాటు లేకపోవడం కూడా వైరస్ ల వ్యాప్తికి దారితీస్తోందని గుర్తించారు. పని ప్రదేశాల్లో కఠిన నియంత్రణలు, ఇలాంటి గ్రూపులు లక్ష్యంగా వ్యాక్సినేషన్ చేపట్టడం ద్వారా నైట్ షిఫ్ట్ ల్లో పనిచేసే వారిలో కొవిడ్ ముప్పును తగ్గించవచ్చని అథ్యయనం సూచించింది.