హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్రపన్నిన నలుగురు ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులకు ఎట్టకేలకు శిక్ష పడింది. ఒకొకరికీ పదేండ్ల జైలుశిక్ష విధిస్తూ ఢిల్లీ ఎన్ఐఏ కోర్టు తీర్పునిచ్చింది. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఒబేద్ రెహ్మాన్, ఇమ్రాన్ఖాన్, ధనీశ్ అన్సారీ, అఫ్తాబ్ అలంను పేలుళ్ల కేసులో దోషులుగా తేల్చిన ఎన్ఐఏ కోర్టు ఈ తీర్పునిచ్చింది.
నిషేధ జాబితాలో ఉన్న ఈ సంస్థ సానుభూతిపరులైన ఈ నలుగురు దేశంలో పలు పేలుళ్ల కుట్రలో భాగమయ్యారు. గోకుల్చాట్, లుంబినీ పార్, దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లతోనూ వీరికి సంబంధాలు ఉన్నాయని ఎన్ఐఏ రుజువు చేసింది. బెంగళూరు, వారణాసి, ముంబై, ఫజియాబాద్, ఢిల్లీ పేలుళ్లలోనూ వీరి పాత్ర ఉందని తేల్చింది. 2007లో హైదరాబాద్ కోఠి గోకుల్చాట్, లుంబినీ పార్ వద్ద పేలుళ్ల ఘటనలో 42 మం ది, దిల్సుఖ్నగర్లో 17 మంది ప్రాణాలు కోల్పోయారు.