న్యూఢిల్లీ: ఇస్లామ్ స్టేట్ (ISIS) నెట్వర్క్ కేసులో నాలుగు రాష్ట్రాల్లో యాంటీ టెర్రర్ ఏజెన్సీ ఎన్ఐఏ (NIA) ఆకస్మిక దాడులు చేస్తున్నది. కర్ణాటక, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీలోని 19 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. ఉగ్రవాద నెట్వర్క్లోని అనుమానితుల ఇండ్లలో ఎన్ఐఏ అధికారులు తనిఖీచేశారు. కర్ణాటకలోనే 11 ప్రాంతాల్లో దాడులు చేయగా, జార్ఖండ్లో నాలుగు, మహారాష్ట్రలో మూడు, ఢిల్లీలో ఒక ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తున్నారు.