కిరిబాటి: ప్రతి ఏడాది నూతన సంవత్సర వేడుకలు ఏ దేశంలో ముందు జరుగుతాయని అంటే ఎవరైనా టక్కున న్యూజిలాండ్ అని చెబుతారు. కానీ అధికారికంగా మాత్రం ముందుగా నూతన సంవత్సరానికి స్వాగతం పలికే దేశం న్యూజిలాండ్ కాదు. ద్వీప దేశమైన కిరిబాటి ముందుగా కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెబుతుంది. భారత కాలమానం ప్రకారం న్యూజిలాండ్లో సాయంత్రం 4.30 గంటలకు అర్ధరాత్రి 12 అయితే, కిరిబాటిలో మధ్యాహ్నం 3.30 గంటలకే కొత్త సంవత్సరం మొదలవుతుంది.
కిరిబాటి చిన్న దేశం కాబట్టి, దాని గురించి ఎవరికీ పెద్దగా తెలియదు కాబట్టి.. ముందుగా అక్కడే నూతన సంవత్సర వేడుకలు జరిగినా పెద్దగా పబ్లిసిటీ ఉండదు. అందుకే పెద్ద దేశాల్లో ముందుగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే న్యూజిలాండే.. ప్రపంచంలో మొట్టమొదట వేడుకలు చేసుకునే దేశమని అంతా భావిస్తారు. కిరిబాటి మొత్తం 33 దీవుల సముదాయం. ఈక్వెటోరియల్ పసిఫిక్ మహా సముద్రంలో ఉత్తర-దక్షిణంగా 4 వేల కిలోమీటర్లు, తూర్పు-పడమరల్లో 2 వేల కిలోమీటర్ల పరిధిలో ఈ దీవులు విస్తరించి ఉన్నాయి.
కిరిబాటి దేశంలోని కిరీటిమతి ద్వీపంలో భారత కాలమానం ప్రకారం ప్రపంచంలోనే ముందుగా అర్ధరాత్రి 12 గంటలు అవుతుంది. కాబట్టి అధికారికంగా అన్ని దేశాల కంటే ముందే నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే దేశం కిరిబాటి అవుతుంది.