చండీగఢ్, అక్టోబర్ 8: భారత వాయుసేనలో వచ్చే సంవత్సరం నుంచి యువతులను అగ్నివీరులుగా నియమించుకొంటామని ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి తెలిపారు. శనివారం ఎయిర్ఫోర్స్ డే సందర్భంగా చండీగఢ్లో సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడిన ఆయన..వాయుసేనలో కొత్తగా ఆయుధ వ్యవస్థ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. వచ్చే డిసెంబర్లో 3 వేల మంది అగ్నివీరులను నియమించి, ప్రాథమిక శిక్షణ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కాగా ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకొనే కొత్త యూనిఫాంను వాయుసేన సిబ్బందికి అందజేయనున్నది. దీన్ని ఎయిర్ఫోర్స్ డే సందర్భంగా అధికారికంగా విడుదల చేశారు.