హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): పన్నెండు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో వైస్ చాన్సలర్ల(వీసీ) నియామకాలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వీసీగా డాక్టర్ బసుత్కర్ జగదీశ్వర్ రావు(బీజే రావు) నియమితులయ్యారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయం(మనూ) వీసీగా ప్రొఫెసర్ అయినుల్ హసన్ను నియమించారు. హెచ్సీయూ వీసీ జగదీశ్వర్ రావు నిజాం కాలేజీలో బీఎస్సీ, ఉస్మానియాలో ఎంఎస్సీ పూర్తి చేశారు. బెంగళూరు ఐఐఎస్సీలో పీహెచ్డీ చేశారు. ఐఐఎస్ఈఆర్ తిరుపతిలో బయోలజీ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్గా, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్(టీఐఎఫ్ఆర్) ముంబైలో సీనియర్ ప్రొఫెసర్గా సేవలందించారు. మనూ వీసీ అయినుల్ హసన్ ప్రస్తుతం జేఎన్యూలో పర్షియన్ అండ్ సెంట్రల్ ఏషియన్ స్టడీస్ ప్రొఫెసర్గా సేవలందిస్తున్నారు. కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ వీసీగా ఉస్మానియా పూర్వాచార్యుడు బట్టు సత్యనారాయణ నియమితులయ్యారు. కరీంనగర్ జిల్లా బొమ్మకల్కు చెందిన ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో కెమిస్ట్రీ విభాగంలో 13 ఏండ్ల పాటు ప్రొఫెసర్గా పనిచేశారు.