న్యూఢిల్లీ, జూన్ 10: కరోనా వ్యాక్సిన్లను ఒక ప్రణాళికనేదే లేకుండా అన్ని వయస్సుల వారికీ వేసుకుంటూ వెళ్తే వైరస్ మరింత ప్రమాదకరంగా మారి కొత్త మ్యుటెంట్లు వచ్చే అవకాశం ఉందని వైద్యనిపుణులు కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించారు. ‘కరోనా వైరస్పై టీకా అనేది ఒక శక్తివంతమైన ఆయుధం. దానిని దాచిపెట్టాల్సిన పని లేదు.. అలాగని, విచక్షణారహితంగా ఉపయోగించాల్సిన అవసరమూ లేదు. అత్యధిక ప్రయోజనం లభించేలా వ్యూహాత్మకంగా దానిని వాడుకోవాలి’ అని పేర్కొన్నారు. ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఎపిడెమాలజిస్ట్స్ సంయుక్తంగా ఒక నివేదికను ప్రధాని నరేంద్రమోదీకి సమర్పించారు. వ్యాక్సినేషన్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అందులో పేర్కొన్నారు. ఆ వివరాలు..