ముంబై : మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వంలో మంత్రులపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సరికొత్త అధికారాలను పొందారు. మంత్రులు లేదా ప్రధాన కార్యదర్శి, ఇతర శాఖల కార్యదర్శులు తీసుకున్న నిర్ణయాలను సమీక్షించి అవసరమైతే మార్పులు లేదా రద్దు చేసే అధికారం ఇక నుంచి ఆయనకు ఉంటుంది. మహారాష్ట్ర రూల్స్ ఆఫ్ బిజినెస్ 2026ను అధికారికంగా ఫడ్నవీస్ ప్రభుత్వం నోటిఫై చేసింది.
ఆర్టికల్ 166(2), ఆర్టికల్ 166(3) ప్రకారం జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రాష్ట్ర గెజిట్లో ఈ నిబంధనలు ప్రచురించింది. దీంతో మం త్రులు లేదా కీలక అధికారుల నిర్ణయాలపై సీఎం ఎప్పుడైనా వివరణ కోరవచ్చు. మంత్రులు తీసుకునే ప్రతి నిర్ణయంపై సమీక్ష జరిపి ఏకపక్షంగా రద్దు చేసే అధికారం ఉంటుంది. ఏ శాఖ మంత్రి చేపట్టిన పనుల ఫైళ్లను అయినా సీఎం అడగవచ్చు.