Ram Mandir Latest Photos | అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నది. ఈ నెల 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరుగనున్నది. ఇప్పటికే ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు ప్రారంభమైన విషయం తెలిసిందే. భారతీయ చారిత్రక సాంస్కృతిక వైభవం, నిర్మాణ శైలికి ప్రతీకగా ఆలయం నిలువబోతున్నది. ఆలయాన్ని అద్భుతమైన శిల్పాలను అందంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఫినిషింగ్ పనులు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో నేపథ్యంలో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఫొటోలను విడుదల చేసింది. ఇవి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఇప్పటికే రాముడి గర్భాలయం పనులు పూర్తయ్యాయి. జనవరి 22న ప్రధాని మోదీ విగ్రహ ప్రతిష్ఠ చేయనున్నారు. 23 నుంచి దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులకు బాల రాముడు దర్శనం ఇవ్వనున్నారు. ఇప్పటికే ప్రారంభోత్సవానికి సంబంధించిన క్రతువులు మొదలయ్యాయి. బుధవారం రామ్లల్లా విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలోకి తీసుకువచ్చారు.
ఈ క్రమంలో అయోధ్య నగరం శ్రీరామ సంకీర్తనలతో మారుమోగుతున్నది. ఇక ప్రధాని నరేంద్ర మోదీ ఆలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఒక రోజు ముందే అయోధ్య నగరానికి చేరుకునే అవకాశం ఉంది. జగద్గురు రాంభద్రాచార్య అమృత్ జన్మోత్సవ్, రామచరిత్ మానస్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అయోధ్య పర్యటన నేపథ్యంలో పలు కార్యక్రమాలకు సైతం పాల్గొననున్నట్లు తెలుస్తున్నది.