న్యూఢిల్లీ, అక్టోబర్ 14: నాలుగు దశాబ్దాల అనంతరం భారత్-శ్రీలంక మధ్య పడవ సేవలు ప్రారంభమయ్యాయి. తమిళనాడులోని నాగపట్టిణం, శ్రీలంకలోని కంకేసంతురై మధ్య నడిచే అంతర్జాతీయ హై స్పీడ్ ప్రయాణికుల ఫెర్రీ సర్వీస్ శనివారం ప్రారంభమైంది.
ఈ సందర్భంగా ఇరు దేశాల దౌత్య ప్రయత్నాలను భారత ప్రధాని మోదీ, శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే ప్రశంసించారు.