Shinde to Merger MNS | మహారాష్ట్రలోని అధికార శివసేనలో సంక్షోభం కొత్త మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. శివసేన అధినేత ఉద్ధవ్ఠాక్రే బంధువు రాజ్ఠాక్రే సారధ్యంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్)లో తమ గ్రూప్ను విలీనం చేయాలని శివసేన రెబెల్ నేత ఏక్నాథ్ షిండే భావిస్తున్నట్లు సమాచారం. శివసేన ఎమ్మెల్యేల్లో 37 మంది సభ్యుల మద్దతు ఉన్నా. అసెంబ్లీలో ప్రత్యేక పార్టీగా గుర్తింపు పొందడం అంత తేలికేం కాదు. ఒకవేళ, రాష్ట్రపతి ఎన్నికల్లోపు రెబెల్స్ గ్రూప్ సమస్య పరిష్కరించుకోగలిగితే వేరేపార్టీలో విలీనం కావడం ఈజీ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎమ్మెన్నెస్లో షిండే గ్రూప్ విలీనం అయ్యేందుకు భారీ అవకాశాలు ఉన్నాయంటున్నారు.
ఎమ్మెన్నెస్తో అనుంబంధం ఉన్న ఓ బడా నేత స్పందిస్తూ.. షిండే గ్రూప్ నుంచి తమ పార్టీలో విలీనం కావడానికి ఆఫర్ తప్పక వచ్చిందంటున్నారు. కానీ దీన్ని ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ఠాక్రే పరిగణనలోకి తీసుకున్నారా.. లేదా.. ఇంకా తెలియలేదు. రాజకీయాల్లో ముగింపు అనేదేమీ ఉండదని ఒక ఎమ్మెన్నెస్ నేత చెప్పారు. ఇరువర్గాలు ఒకే సిద్దాంతంపై పని చేస్తున్నందున, వారిద్దరూ కలిస్తే మహారాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందంటున్నారు. ఈ విషయమై రెండు వైపులా చర్చ ప్రారంభమైందని చెబుతున్నారు.
ఇప్పటివరకు రాజ్ఠాక్రేతో ఏక్నాథ్ షిండే మూడు దఫాలు మాట్లాడారని సమాచారం. ఇటీవల తుంటికి శస్త్ర చికిత్స చేయించుకున్న రాజ్ఠాక్రే ఆరోగ్యం గురించి మాత్రమే షిండే వాకబు చేశారని సమాచారం. షిండేతో సహా 16 మంది ఎమ్మెల్యేలు అనర్హులని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ ప్రకటించిన నేపథ్యంలో వారిని కాపాడుకునేందుకు ఏదైనా రాజకీయ పార్టీలో విలీనం చేయడమే పరిష్కార మార్గం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపుతున్నా.. అసెంబ్లీలో ఎమ్మెన్నెస్కు ఏకైక ఎమ్మెల్యే ఉన్నారు. రాజ్ఠాక్రే, ఏక్నాథ్ షిండే ఇద్దరూ బాల్ఠాక్రే శిష్యులే, హిందూత్వ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఎమ్మెన్నెస్లో షిండే గ్రూప్ విలీనం సరైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
మహారాష్ట్రలో శివసేనను దెబ్బ కొట్టేందుకు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్)ను వాడుకోవాలని బీజేపీ సన్నాహాలు చేస్తున్నది. బీజేపీలో ఎమ్మెన్నెస్ విలీనం కోసం ఈ నెల 14న చర్చలు మొదలయ్యాయని తెలుస్తున్నది. ఆరెస్సెస్ దీవెనలతోనే ఇదంతా జరుగుతున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో షిండే గ్రూప్ విలీనంతో ఎమ్మెన్నెస్ను బలోపేతం చేసేందుకు బీజేపీ విజయవంతమైన ప్లాన్ రూపొందించినట్లు విశ్వసనీయంగా తెలుస్తున్నది. త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ విషయమై ఎమ్మెన్నెస్, బీజేపీ మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. ముంబై, పుణెల్లో ఎమ్మెన్నెస్కు కొన్ని సీట్లు ఇచ్చి.. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. ఈ విషయమై గత ఏప్రిల్ 21న రెండు పక్షాల మధ్య కీలక భేటీ జరిగినట్లు కనిపిస్తున్నది.
ఏకైక ఎమ్మెల్యే బచ్చు కదు సారధ్యంలోని ప్రహర్ పార్టీలో శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే గ్రూప్ విలీనానికి అవకాశాలు ఉన్నాయి. షిండే గ్రూప్తోనే బచ్చు కదు కూడా గువాహటిలో బస చేశారు. సొంత చరిస్మాపై విజయం సాధించిన బచ్చు కదు.. సుదీర్ఘ కాలం ఏక్నాథ్ షిండేతో కలిసి ఉండే అవకాశాలు లేవని తెలుస్తున్నది.