న్యూఢిల్లీ, జనవరి 2: ఇటీవల చట్ట సభల్లో ఆమోదం పొందిన మూడు క్రిమినల్ చట్టాల అమలుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. మూడు క్రిమినల్ చట్టాలు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్ఏ)లను ఈ నెల 26లోగా నోటిఫై చేసి, ఏడాదిలోగా దేశమంతా అమలు చేస్తారని ఒక ఉన్నతాధికారి మంగళవారం తెలిపారు.
ఇటీవల ముగిసిన శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లులకు పార్లమెంట్ ఆమోదం తెలుపగా, డిసెంబర్ 25న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ మూడు చట్టాలు నోటిఫై చేసిన తర్వాత హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, దర్యాప్తు అధికారులు, ఫోరెన్సిక్ విభాగాల వారికి శిక్షణ ఇస్తారు.