Nehru Out Savarkar In | ప్రధాని నరేంద్రమోదీ `హర్ఘర్ తిరంగా` ప్రచారంలో కర్ణాటక సర్కార్ సరికొత్త వివాదానికి తెర తీసింది. స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించేందుకు ఆదివారం జారీ చేసిన ప్రకటన అందుకు కారణమైంది. కర్ణాటకలోని బస్వరాజ్ బొమ్ము సర్కార్ తీరుపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ మండి పడింది.
సదరు వాణిజ్య ప్రకటనలో భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఫొటోను తొలగించింది కర్ణాటక సర్కార్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) కు చెందిన వినాయక్ సావర్కర్ను రివల్యూషనరీ సావర్కర్ అని పేర్కొంది. దేశ విభజనలో సంస్మరణ రోజు ( Partition Horrors Remembrance Day ) అనే పేరుతో జారీ చేసిన పూర్తి పేజీ వాణిజ్య ప్రకటనలో ఈ వివాదం చోటు చేసుకున్నది.
దేశ విభజనకు పండిట్ నెహ్రూ, పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా బాధ్యత వహించాలంటూ అధికార బీజేపీ ట్వీట్ చేసిన వీడియోపై అధికార బీజేపీ.. కాంగ్రెస్ మధ్య విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధాని తన రాజకీయ యుద్ధాలకు బాధాకరమైన చారిత్రక ఘటనలను ఉపయోగించుకుని విభజన ఘోరాల సంస్మరణ దినోత్సవం.. ఆగస్టు 14 అంటూ వాడుకోవడంలో నిజమైన ఉద్దేశాలు అర్థం అవుతున్నాయని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ పేర్కొన్నారు.
ఝాన్సీరాణి, గాంధీ, సావర్కర్ జాతీయోద్యమంలో పాల్గొన్నారు. నెహ్రూ దేశ తొలి ప్రధాని అయినా.. దేశ విభజనకు కారణమయ్యారని బీజేపీ అధికార ప్రతినిధి రవి కుమార్ అన్నారు. అందువల్లే వాణిజ్య ప్రకటన నుంచి నెహ్రూ ఫొటో తొలగించినట్లు తెలిపారు.
Sorry Nehru is not a freedom fighter but Savarkar is. 🤷🏻♀️ pic.twitter.com/m6sZ7YOuAf
— Savukku Shankar (@Veera284) August 14, 2022