న్యూఢిల్లీ: గురుగ్రామ్లోని ముస్లింలు శుక్రవారం ప్రార్థనలను బహిరంగ ప్రదేశాల్లో నిర్వహిస్తే ఉపేక్షించబోమని హర్యానా సీఎం మనోహర్లాల్ ఖట్టర్ అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ విషయంలో 2018లో హిందువులు, ముస్లింల మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. అనుమతించిన బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేయడానికి ప్రభుత్వం అనుమతించింది. గురుగ్రామ్లో దీనిపై కొద్ది రోజులుగా రెండు వర్గాల మధ్య వివాదం నడుస్తున్నది. ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుక్కొనేదాకా ఇండ్లలో ప్రార్థనలు చేసుకోవాలని ముస్లింలకు ఖట్టర్ సూచించారు.