వైరల్ ఇన్ఫెక్షన్తో 400 కాకులు మృతి

భోపాల్: రాజస్థాన్లో ఏవియన్ ఫ్లూ కారణంగా కాకుల మరణాలు కొనసాగుతుండగానే మధ్యప్రదేశ్లో కుప్పలు తెప్పలుగా కాకులు మృతిచెందుతుండటం కలకలం రేపుతున్నది. ఇటీవల మధ్యప్రదేశ్లో వరుసగా కాకులు మరణిస్తున్నాయి. ఇప్పటివరకు మొత్తం 400 కాకులు మృత్యువాతపడ్డాయి. అయితే, ఒక కొత్త రకం వైరస్ కారణంగా ఈ కాకుల మరణాలు సంభవిస్తున్నట్లు తమ వైద్యాధికారుల పరిశోధనల్లో తేలిందని మధ్యప్రదేశ్ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ ఆర్కే రోక్డే చెప్పారు.
ఈ కొత్త వైరస్ ప్రభావం పౌల్ట్రీల్లో కనిపించడంలేదని, కేవలం గాల్లో ఎగిరే పక్షుల్లోనే ఉన్నదని రోక్డే తెలిపారు. మధ్యప్రదేశ్లోని ఎనిమిది జిల్లాలో వైరస్ ప్రభావం కనిపిస్తున్నదని చెప్పారు. ఈ వైరస్ రాజస్థాన్ నుంచి వచ్చి ఉంటుందని, ప్రస్తుతం దీనికి ఎలాంటి వ్యాక్సిన్ లేదని రోక్డే వెల్లడించారు.
తాజావార్తలు
- కిసాన్ ర్యాలీ భగ్నానికి ఉగ్ర కుట్ర
- రాజ్యాంగం అసలు కాపీని ఆ బాక్స్లో ఎందుకు ఉంచారో తెలుసా?
- ఎగిరే బల్లి..పొలంలో అలజడి
- ట్రంప్ కొత్త పార్టీ పెట్టడం లేదు..
- ఈ 'కుక్క' మాకూ కావాలి
- చైనాలో ఇంటర్నెట్ స్టార్ గా మారిన 4ఏళ్ల చిన్నారి, స్పేస్ సూట్ లో పీపీఈ కిట్
- కరోనా టీకా తీసుకున్న ఎమ్మెల్యే సంజయ్
- మురికివాడలో మెరిసిన ముత్యం..సెలబ్రిటీలను ఫిదా చేసిన మలీషా
- అమెరికాలో కాల్పులు.. గర్భిణి సహా ఐదుగురు మృతి
- వ్యవసాయ చట్టాలతో రైతులపై ప్రధాని దాడి: రాహుల్గాంధీ