(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): హత్యాయత్నం కేసులో దోషిగా తేలి పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోయిన ఎన్సీపీ నేత, లక్షద్వీప్ మాజీ ఎంపీ మహమ్మద్ ఫైజల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు విధించిన శిక్షపై కేరళ హైకోర్టు స్టే విధించినా అనర్హత వేటు కొనసాగించడం అన్యాయమని పేర్కొన్నారు.
ప్రతీరోజూ పార్లమెంట్కు వెళ్లినా.. భద్రతా సిబ్బంది లోపలికి అనుమతించట్లేదని వాపోయారు. తనపై అనర్హత వేటును ఎత్తేసేలా ఆదేశాలు ఇవ్వాలని, దీనికోసం పిటిషన్ను వెంటనే విచారించాలని సుప్రీంకు విన్నవించారు. ఫైజల్ విజ్ఞప్తిని మన్నించిన అత్యున్నత ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించింది.