Pak | పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ ముస్లిం లీగ్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మిస్టర్ క్లీన్గా ఉన్న ప్రధాని చివరకు నిజాయితీ లేని వ్యక్తిగా, రాజకీయ దుండగుడిగా తెరపైకి వచ్చారని తీవ్రంగా విరుచుకుపడ్డారు. విదేశీ నిధుల విషయంలో ప్రధాని ఇమ్రాన్ గోల్మాల్ చేశారని, మిస్టర్ క్లీన్గా ఉన్న వ్యక్తి, చివరకు నిజాయితీ లేని వ్యక్తిగా తేలారని నవాజ్ షరీఫ్ విమర్శించారు. నవాజ్ షరీఫ్ పార్టీకి విదేశాల నుంచి నిధులు వచ్చాయని, వాటిని చాలా తక్కువ మొత్తంగా చూపించారని, పైగా వాటి బ్యాంకు ఖాతాలను కూడా దాచిపెట్టారంటూ ఎన్నికల సంఘం ఓ రిపోర్టులో పేర్కొంది.
ఈ నేపథ్యంలోనే మాజీ ప్రధాని నవాజ్ ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్పై విరుచుకుపడ్డారు. 2009 -2013 మధ్య 312 మిలియన్ల (పాకిస్తాన్ కరెన్సీ ప్రకారం) లెక్కను తక్కువ చూపారని, ఒక్క 2012-13 లోనే 145 మిలియన్లను తక్కువగా చూపారన్నది ఇమ్రాన్ పార్టీపై ఉన్న అభియోగం. అయితే ఈసీపీ ప్రస్తుతానికి లెక్కలు మాత్రమే చెప్పిందని, ఏ వ్యక్తి నుంచి ఎంత తీసుకున్నారు? ఎంత ఖర్చు పెట్టారు? అన్న విషయాలు పూర్తిగా తెలిస్తే మాత్రం, ఇంకెలా వుంటుందోనని నవాజ్ షరీఫ్ ఎద్దేవా చేశారు.