చంఢీఘడ్: పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ తన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే ఇవాళ వెల్లడించారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సెప్టెంబర్ 28వ తేదీన సిద్దూ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ మీడియా సమావేశం నిర్వహించిన సిద్దూ.. తన తాజా నిర్ణయాన్ని వెల్లడించారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్గా తన బాధ్యతలను మళ్లీ నిర్వర్తించనున్నట్లు చెప్పారు. తాను తీసుకున్న నిర్ణయం వ్యక్తిగతమైంది కాదన్నారు. ఇటీవల రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఏపీఎల్ డియోల్ రాజీనామా చేశారు. ఇక కొత్త డీజేపీని కూడా నియమించనున్న నేపథ్యంలో.. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్గా సిద్దూ బాధ్యతలు చేపట్టనున్నారు.