చండీగఢ్: శిరోమణి అకాలీదళ్ పార్టీ కీలక నాయకుడు బిక్రమ్ సింగ్ మజీతియాపై పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవజ్యోత్సింగ్ సిద్ధూ ( Navjot Singh Sidhu ) మండిపడ్డారు. మజీతియాకు దమ్ముంటే కేవలం తాను పోటీచేస్తున్న అమృత్సర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి మాత్రమే బరిలో దిగాలని సవాల్ విసిరారు. మజీతా స్థానంలో పోటీ నుంచి తప్పుకోవాలన్నారు.
సిద్ధూకు తన సొంత నియోజకవర్గమైన అమృత్సర్ ఈస్ట్లో బలమైన పోటీ ఇవ్వడానికి శిరోమణి అకాలీదళ్ పార్టీ మజీతియాను రంగంలోకి దించింది. అయితే బిక్రమ్ సింగ్ మజీతియా కేవలం అమృత్సర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి మాత్రమేగాక, మజీతా నియోజకవర్గం నుంచి కూడా పోటీచేస్తున్నారు. ఈ మేరకు రెండు నియోజకవర్గాల్లో నామినేషన్లు కూడా వేశారు.
ఈ క్రమంలో మజీతియాపై సిద్ధూ విమర్శలు చేశారు. తనపై కచ్చితంగా గెలుస్తానన్న నమ్మకం లేకనే మజీతియా అమృత్సర్ ఈస్ట్తోపాటు ఆయన సొంత నియోజకవర్గం మజీతా నుంచి కూడా బరిలో దిగుతున్నాడని ఎద్దేవా చేశారు.