న్యూఢిల్లీ, జూన్ 13: పేపర్ లీకేజ్, పరీక్షల్లో కుంభకోణాలు వంటి అంశా ల్లో మోదీ సర్కార్ వైఫల్యాలపై పోరాడేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నది. ఆ పార్టీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఇటీవల నీట్ పేపర్ లీకేజ్, సీబీఎస్ఈ పరీక్షా ఫలితా ల్లో అవకతవకలు, నిరుద్యోగం వంటి అంశాలపై రాహుల్గాంధీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యక్రమాలు చేపట్టబోతున్నది.
ఈ విషయాన్ని కాం గ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. విద్యార్థు లు, యువత, నిరుద్యోగులు, పలు సం స్థలతో కలిసి నిరసనలు చేపడుతామ న్నారు. కేంద్ర వైఫల్యం వల్ల యువత, విద్యార్థులు, నిరుద్యోగులు ఇబ్బందు లు పడుతున్నారని వేణుగోపాల్ అన్నా రు. అనేక ప్రాంతాల్లో రాహుల్ పర్యటించి ఆందోళనల్లో పాల్గొంటారని చె ప్పారు. జూన్ 17న కోటలో విద్యార్థులతో ఆందోళన చేస్తారని, ప్రయాగ్రా జ్, పట్నా, ఢిల్లీలో యువతతో కలిసి రాహుల్ ఆందోళన చేపడతారన్నారు.