లేహ్: కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లోని కార్గిల్లో లడఖ్ అటానమస్ హిల్ కౌన్సిల్కు (Ladakh Council elections) ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. 26 స్థానాలకు 85 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి 19 స్థానాల్లో గెలుపొందాయి. ఎన్సీ 11, కాంగ్రెస్ 8 సీట్లలో విజయం సాధించాయి. బీజేపీ 2 సీట్లు, ఐఎన్డీపీ ఒక సీటు గెలుచుకున్నాయి. 4 సీట్ల ఫలితాలు రావాల్సి ఉంది.
కాగా, 2019 ఆగస్ట్ 5న జమ్ముకశ్మీర్ స్వయం ప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్ 370ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే ఆ రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్లోని రాజకీయ పార్టీల నేతలను గృహ నిర్బంధం చేసింది.
మరోవైపు ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్ విభజన జరిగిన సుమారు నాలుగేళ్ల తర్వాత ఆ ప్రాంతంలో తొలిసారి స్థానిక ఎన్నికలు జరిగాయి. లడఖ్ అటానమస్ హిల్ కౌన్సిల్ ఎన్నికల ఫలితాల్లో నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు ఈ తీర్పు ఇచ్చినట్లుగా జమ్ముకశ్మీర్లోని రాజకీయ పార్టీలు పేర్కొన్నాయి.
కాగా, రాష్ట్ర విభజన వల్ల తాము చాలా నష్టపోయినట్టు పోలింగ్ సందర్భంగా కార్గిల్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్ను తిరిగి విలీనం చేయడంతోపాటు రాష్ట్రహోదాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాల్లో ఎన్సీ-కాంగ్రెస్ కూటమి విజయంపై సంబరాలు జరుపుకున్నారు.
#WATCH |Visuals of celebrations by Congress workers from Kargil
5th LAHDC Kargil elections update | National Conference and Congress combined won 19 seats, BJP won 2 seats and INDP won 1 seat. Results on 4 seats are yet to come pic.twitter.com/BWcRFPgV51
— ANI (@ANI) October 8, 2023