పుణే, మార్చి 26: ‘ది గట్లెస్ ఫుడీ’గా ప్రాచుర్యం పొందిన పుణేకు చెందిన ఫుడ్ వ్లాగర్ నటాషా దిడ్డీ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె భర్త ఇన్స్టాగ్రామ్లో వెల్లడించారు. చెఫ్ అయిన నటాషా ఫుడ్ వ్లాగర్గా రకరకాల ఆహారాలను తన ఫాలోయర్లకు పరిచయం చేసేది. కాగా, నటాషాకు పొట్ట చుట్టూ అల్సర్లు, కణితి ఉన్నందున వైద్యులు గ్యాస్ట్రెక్టమీ శాస్త్రచికిత్స చేసి ఆమె పొట్టను తొలగించారు. దీంతో ఆమె భోజనం చేసిన గంట లోపే ఆహారం బయటకు వెళ్లిపోయేది. ఇంత పెద్ద సమస్య ఉన్నప్పటికీ ఆమె చలాకీగా కనిపిస్తూ వీడియోలు చేసేవారు.