ముంబై: నాసిక్లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)లో మతమార్పిడులు జరిగిన కేసులో నిందితురాలు నిదా ఖాన్(Nida Khan) ప్రస్తుతం ముంబైలో ఉన్నట్లు తెలిసింది. ఆమె గర్భవతి అని ఆమె కుటుంబసభ్యులు పేర్కొన్నారు. త్వరలో ఆమె తల్లి కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం నిదా ఖాన్ పరారీలో ఉన్నది. ముందస్తు బెయిల్ కోసం నాసిక్లోని స్థానిక కోర్టును ఆమె ఆశ్రయించింది. బెయిల్ అప్లికేషన్లో ఆమె తన ఆరోగ్యం గురించి వెల్లడించి ఉంటుందని భావిస్తున్నారు. ఈ కేసును విచారిస్తున్న సిట్ అదికారులు ఆమెను కస్టడీలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
టీసీఎస్లో లైంగిక వేధింపులు, మతమార్పుడులు జరిగినట్లు 9 ఫిర్యాదులు అందినట్లు పోలీసులు చెప్పారు. ఆ కేసుల్ని విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఏడు మంది ఉద్యోగుల్ని అరెస్టు చేశారు. దీంట్లో ఆరుగురు పురుషులు, ఓ మహిళ ఉన్నది. సీనియర్ ఉద్యోగులు తమను మానసికంగా, శారీరకంగా వేధించినట్లు 8 మంది మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదులను హెచ్ఆర్ మేనేజ్మెంట్ విస్మరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫిబ్రవరి 2022 నుంచి 2026 వరకు ఈ అఘాయిత్యాలు జరిగినట్లు తెలుస్తోంది.