కోల్కతా: నారద స్కామ్ కేసుకు సంబంధించి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆ రాష్ట్ర న్యాయ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా కలకత్తా హైకోర్టులో తాజాగా అఫిడవిట్లు దాఖలు చేశారు. ఈ నెల 9న మమతా బెనర్జీ ఇచ్చిన సమాధాన అఫిడవిట్లను అంగీకరించడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించగా జూన్ 9 నాటి హైకోర్టు ఆర్డర్ను ఈ నెల 25న సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. జూన్ 28లోగా హైకోర్టులో తాజాగా అఫిడవిట్లను దాఖలు చేయాలని మమతా బెనర్జీ, న్యాయ శాఖ మంత్రి, బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అఫిడవిట్లను రికార్డు చేయాలని హైకోర్టుకు సూచించింది. ఈ నేపథ్యంలో, మే 17న నలుగురు టీఎంసీ నేతలను సీబీఐ అరెస్ట్ చేసిన సందర్భంగా అడ్డుకునేందుకు ప్రయత్నించిన పాత్రకు సంబంధించి మమతా బెనర్జీ, న్యాయ మంత్రి ఎమ్ప్లోయ్ ఘటక్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కోల్కతా హైకోర్టులో తాజాగా అఫిడవిట్లు దాఖలు చేశారు.