Nara Brahmani | టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ ముద్దుల కుమార్తె నారా బ్రాహ్మణి లద్దాఖ్లో బైక్ రైడ్ చేశారు. జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ సంస్థ చేపట్టిన రైడ్ ట్రిప్లో పాల్గొన్న బ్రాహ్మణి.. హిమాలయ పర్వతాల మధ్య బైక్పై దూసుకెళ్తూ అక్కడి నేచర్ను ఎంజాయ్ చేశారు. ప్రమాదకరమైన రోడ్ల మీద సునాయాసంగా బైక్ రైడింగ్ చేసి అబ్బురపరిచారు.
బైక్ రైడ్లో తన అనుభవాలను బ్రాహ్మణి వీడియోలో పంచుకున్నారు. ‘లద్దాఖ్ చాలా అద్భుతంగా, అందంగా ఉంది. రైడ్ను చాలా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు టైమ్ 6:30 అయ్యింది. ఉదమయే బయల్దేరి థక్సే ఆరామానికి చేరుకున్నాం’ అని బ్రాహ్మణి పేర్కొన్నారు. ఈ ట్రావెల్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.