Drug Mafia : వర్లి హిట్ అండ్ రన్ కేసులో మహారాష్ట్రలోని ఏక్నాథ్ షిండే సర్కార్ లక్ష్యంగా రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలె విమర్శలు గుప్పించారు. షిండే సర్కార్ ప్రోత్సాహంతో రాష్ట్రంలో మాఫియాలు చెలరేగాయని ఆరోపించారు. అతని (నిందితుడు మిహిర్ షా) రక్తంలో డ్రగ్స్ ఉండి ఉంటాయి, అతను రక్త పరీక్ష అనంతరం పోలీసుల ఎదుటలొంగిపోయాడని అన్నారు. మిహిర్ షాను పోలీసులు అరెస్టు చేయలేదని చెప్పారు. షిండే సర్కార్ రాష్ట్రంలో డ్రగ్ మాఫియాలకు ఊతం ఇస్తోందని, ప్రభుత్వ తీరు ఇలా ఉంటే ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని అన్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వ నిర్వాకంతోనే పరిస్ధితి ఇలా దిగజారిందని ఆందోళన వ్యక్తం చేశారు. సంపన్నుల కోసం షిండే సర్కార్ పనిచేస్తో్ందని, పేదలకు ఏమైనా జరిగినా ఈ ప్రభుత్వం పట్టించుకోదని దుయ్యబట్టారు. మరోవైపు మహారాష్ట్ర రాజధాని ముంబైలో శివసేన (Shiv Sena) నేత రాజేష్ షా (Rajesh Shah) కుమారుడు మిహిర్ మద్యం మత్తులో కారు నడిపి ఓ వివాహిత మరణానికి కారణమైన ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది.
ఈ ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపడుతున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు మిహిర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో రాజేష్ షాపై శివసేన చర్యలు చేపట్టింది. ఆయన్ని పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించింది. ఈ మేరకు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీ బుధవారం ప్రకటించింది. కాగా, ఈ కేసులో రాజేష్ షా అరెస్టై సోమవారం బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే.
Read More :